తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారంతో ముగియనున్నాయి. నిన్న సభలో కుల జనగణన తీర్మానం పెట్టాలని భావించిన రేవంత్ సర్కార్.. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ఆలస్యం అవ్వడంతో నేటికి వాయిదా పడింది. ఇవాళ ఉదయం 10 గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి సభలో కులగణన తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. అలాగే నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.