మసాలాల నిషేధంపై వివరణ కోరిన కేంద్రం

నాణ్యత లోపం కారణంగా ఎవరెస్ట్, MDH మసాలాలను హాంకాంగ్, సింగపూర్ దేశాలు నిషేధించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన భారత్ దీనికి గల కారణాలను పేర్కొంటూ వివరాలను అందించాలని ఆ రెండు దేశాల్లోని రాయబార కార్యాలయాలను కేంద్ర వాణిజ్య శాఖ కోరింది. కాగా ఇటీవల వీటిని పరీక్షించగా, 'ఇథిలీన్ ఆక్సైడ్' అనే క్రిమిసంహారక మందులు పరిమితులకు మించి ఉన్నాయని గుర్తించారు. దీంతో ఈ రెండు మసాలాలపై నిషేధం విధించాయి.

సంబంధిత పోస్ట్