యూపీలోని సమాజ్వాది పార్టీకి చెందిన పుష్పేంద్ర సరోజ్(కౌశాంబి), ప్రియ సరోజ్(మచ్లిషహర్) లోక్సభకు ఎన్నికైన అతిపిన్న వయస్కులుగా నిలిచారు. వీరిద్దరూ 25 ఏళ్లకే ఎంపీగా ఎన్నికయ్యారు. మరోవైపు తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ డీఎంకే అభ్యర్థి TR బాలు(82) లోక్సభ ఎంపీగా ఎన్నికైన అతిపెద్ద వయస్కునిగా నిలిచారు.