UCT NET పరీక్ష రద్దు చేయడంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే గురువారం ఫైర్ అయ్యారు. పరీక్ష రాసిన ఒక రోజు తర్వాత రద్దు చేయడంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల ఫలితాల నుంచి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రం ఏమీ నేర్చుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో పరీక్షా ప్రక్రియ నిర్మాణం కుప్పకూలిందన్నారు. పేపర్ లీక్లు, అక్రమాలు బాగా జరుగుతున్నాయన్నారు.