బీజేపీ స్టేట్ చీఫ్, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గురువారం కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కేబినెట్ హోదాలో బొగ్గు, గనులశాఖ మంత్రిగా నియమితులైన కిషన్రెడ్డి ఢిల్లీలోని శాస్త్రిభవన్ A బ్లాక్లో ఉదయం 11 గంటలకు, హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉదయం 10.35 గంటలకు నార్త్ బ్లాక్లో పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.