ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లోని భిలాయ్లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. దిలీప్ రౌత్కర్ (52) అనే వ్యక్తి ఓ పెళ్లికి వెళ్లాడు. అతను వేదికపై నవ వధూవరులతో కలిసి డాన్స్ చేశాడు. విశ్రాంతి కోసం కూర్చున్న ఆయన ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చనిపోతున్నారన్న విషయం తెలిసిందే.