కామారెడ్డి జిల్లా బీర్కూర్ శివారులో చెరువులో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. అంకూష్ఖాన్ చెరువులో పడి అభిలాష్, గణేష్ కొట్టుకుపోయారు. ఇద్దరు యువకుల కోసం జాలర్లు గాలిస్తున్నారు. బీర్కూర్ ఉన్నత పాఠశాలలో అభిలాష్ పదో తరగతి చదువుతున్నాడు. బీర్కూర్లో గణేష్ మెకానిక్గా పనిచేస్తున్నారు.