అసోంలోని నాగావ్ జిల్లాలో ఇద్దరు ముస్లిములను ఫారెస్టు గార్డు కాల్చివేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. లఖోవా వన్యప్రాణుల అభయారణ్యంలో అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించడంతో ఈ నెల 22న ఫారెస్టు గార్డు కాల్చివేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ కాల్పుల్లో నాగావ్ జిల్లా డింగ్బారిచాపారి గ్రామానికి చెందిన ముస్లిం సోదరులు అబ్దుల్ జలీల్ (40), సమరుద్దీన్ (35) మరణించారు.