ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలోని రతిభాన్పూర్లో నిర్వహించిన శివారాధన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ఇప్పటి వరకూ 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 28 మంది గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం హథ్రాస్కు చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు.