మధ్యప్రదేశ్లోని భోపాల్లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. నగరంలోని ఓ కూడలిలో మహారాణా ప్రతాప్ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు కాంగ్రెస్ నేత జితేంద్ర సింగ్ రాజ్పుత్ వెళ్లారు. తనతో పాటు మరికొందరు నేతలను ఆయన తీసుకెళ్లారు. క్రేన్ సాయంతో విగ్రహం వద్దకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాలిలో ఉండగా క్రేన్ కొంత భాగం విరిగిపోయింది. జితేంద్రతో సహా ఇతర నేతలు కింద పడ్డారు. ఈ ప్రమాదంలో జితేంద్రకు కాలు విరిగింది.