కూలీలకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ

వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రాపోల్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రెడ్డికి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. నరేంద్ర మోడీ అందిస్తున్న పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, నరసింహా, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్