కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. వర్షం కారణంగా మంగళూరులో బుధవారం ఉదయం ఇంటి వెనుక గోడ కూలడంతో నలుగురు మృతి చెందారు. మున్నూరు మదానీనగర్కు చెందిన యాసిర్ (45), భార్య మరియుమ్మ (40), పిల్లలు రియానా (11), రిఫా (17) మృతి చెందారు. సమాచారం అందుకున్న ఫైరింగ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మున్నార్లో మూడు సహాయ శిబిరాలను ప్రారంభించారు. 12 కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించినట్లు తెలుస్తోంది.