వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల పరిధిలోని ఎంపీడీవో కార్యాలయం ముందు గురువారం రాష్ట్ర పంచాయతీ జేఏసీ పిలుపుమేరకు మండల అధ్యక్షులు కంచ దుడయ్య సమ్మెను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్బదాసి అశోక్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి, వేతనాలు పెంచాలి, కారోబార్ బిల్ కలెక్టర్ గ్రామపంచాయతీ సహాయ కార్యదర్శిగా నియమించాలి అన్నారు.