ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో 2024, ఏప్రిల్ 25న జరిగిన మ్యాచ్లో రణ్వీర్ సింగ్, ఏక్తా, అనురాగ్ స్వర్ణాలు గెలిచారు. పురుషుల 3000 మీ. స్టీపుల్ చేజ్లో రణ్వీర్ 9 నిమిషాల 22.62 సెకన్ల ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచాడు. మహిళల 3000 మీ. స్టీపుల్ చేజ్లో ఏక్తా 10 నిమిషాల 31.92 సెకన్ల టైమింగ్తో పసిడి సొంతం చేసుకుంది. పురుషుల షాట్పుట్లో అనురాగ్ సింగ్ 19.23 మీటర్ల దూరం గుండును విసిరి బంగారు పతకాన్ని నెగ్గాడు.