ఏపీ అంటే అమరావతి, పోలవరమని సీఎం చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. పోలవరం వల్ల రైతులకు మేలు జరిగేదని చెప్పారు. ఈ రెండింటిని వైసీపీ సర్వ నాశనం చేసిందని ధ్వజమెత్తారు. అమరావతి ప్రస్తుత పరిస్థితి చూస్తే బాధ, ఆవేదన కలుగుతోందన్నారు. గత ఐదేళ్లలో అమరావతిలో విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. పైపులు దొంగిలించారు.. రోడ్లను విధ్వంసం చేశారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో పని ఎక్కడ ఆగిందో.. అక్కడే నిలిచిపోయిందని చెప్పారు.