హైదరాబాద్ వాసులకు వాతావరణశాఖ ఇవాళ, రేపు ఎల్లో అలర్ట్ను జారీచేసింది. గంటకు 40 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ఉరుములు మెరుపులతో గాలివాన ఉంటుందని.. పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది.