తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, అల్లూరి, నెల్లూరు, పల్నాడు, బాపట్ల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, జిల్లాల్లో వానలు కురుస్తాయని తెలిపింది. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని సూచించింది.