ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లా సివిల్ లైన్స్లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. కాలేజీ చదువుతున్న ఓ యువతి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో ఓ యువకుడు బైక్పై వెనుక నుంచి దూసుకొచ్చాడు. బైక్పై వేగంగా వెళ్తూ ఆ యువతిపై చేతులు వేసి వేధించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.