ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 4210 నామినేషన్లు

77చూసినవారు
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 4210 నామినేషన్లు
ఏపీలోని 25 లోక్‌సభ స్థానాలకు ఏకంగా 731 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4210 మంది నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన ప్రారంభం కానుంది. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఆ తర్వాత ఏపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. ఏపీలో మే 11వ తేదీన సాయంత్రం ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది.

సంబంధిత పోస్ట్