పవన్ కళ్యాణ్‌తో టీటీడీ ఈవో భేటీ

50చూసినవారు
పవన్ కళ్యాణ్‌తో టీటీడీ ఈవో భేటీ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో వీరు సమావేశమయ్యారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశంపై పవన్ ఆరా తీయగా, గత పాలకమండలి హయాంలో ప్రసాదంలో కల్తీ జరిగినట్లు ఈవో వివరించారు. టీటీడీ తరఫున సంప్రోక్షణ చర్యల గురించి చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్