అనంతపురం సప్తగిరి సర్కిల్లో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నినాదాలు చేశారు. పోలీసులు కార్మికులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. దీంతో పోలీసులు, మున్సిపల్ కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. తమ పట్ల పోలీసుల తీరుపై పారిశుద్ధ్య కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.