ఏపీ సీఎం చంద్రబాబును ఏఐజీ ఆస్పత్రుల ఛైర్మన్ నాగేశ్వర్రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఆరోగ్య సంరక్షణకు ఏఐ, మెడ్ టెక్ పాత్రపై ఆయనతో చర్చించినట్లు సీఎం తెలిపారు. ప్రజలకు ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తెచ్చే విధానాలపై చర్చించామన్నారు. ప్రభుత్వం ఏఐఎం ఫౌండేషన్ పరస్పర సహకారంపైనా చర్చ జరిగినట్లు సీఎం తెలిపారు.