ఏపీలో నర్సింగ్ విద్యలో సంస్కరణల అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా ప్రాంతాల అవసరాల మేరకే నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. మౌలిక వసతులు, బోధనా లోపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సత్య కుమార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. నర్సింగ్ విద్యా సంస్థల్లో లోపాలపై నోటీసుల జారీకి మంత్రి ఆదేశించారు.