AP: రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్యగమనిక. రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఈ-కేవైసీ నమోదు తప్పనిసరి చేసింది. ఈ నెల 31లోపు ఈ-కేవైసీ అప్ డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా, జాతీయ సమాచార సంస్థ ఆధ్వర్యంలో పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసే వాటిలో పారదర్శకత కోసం సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారు. గతంలో ఈ-కేవైసీ లేకపోయినా సరుకులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఈ-కేవైసీ తప్పనిసరి చేసింది.