సీసీ రోడ్డు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మత్స్యలింగం

80చూసినవారు
సీసీ రోడ్డు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మత్స్యలింగం
డుంబ్రిగుడ మండలం అరకు పంచాయితీ గ్రామంలో పంచాయితీ రాజ్ నిధులు రూ. 20 లక్షల రూపాయలతో 400 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సోమవారం కొబ్బరి కాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు ఒక బిట్టు రూ. 10 లక్షలతో, ఇంకో రెండు బిట్టులు రూ. 5 లక్షల రూపాయల చొప్పున నిర్మాణం జరగనుంది. జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ ప్రత్యేక కృషీ చేశారని ఎమ్మెల్యే గ్రామ ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్