పౌష్టికాహార మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

64చూసినవారు
పౌష్టికాహార మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
హుకుంపేట మండలం ముల్యాపుట్టు పంచాయతీ కులపాడు గ్రామంలో.. అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అరకు ఎమ్మెల్యే రేగం మత్యలింగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యామన్నారు. అంగన్వాడీ పిల్లలకు, గర్భిణి స్త్రీలకు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహార పదార్ధాలు పూర్తి స్థాయిలో అందేలా కృషి చేయాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు.

సంబంధిత పోస్ట్