నాడు- నేడు ఆలస్యంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు తిప్పలు

75చూసినవారు
నాడు- నేడు ఆలస్యంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు తిప్పలు
పెదబయలు మండలంలో పెదకోడాపల్లి పంచాయతీకి చెందిన తులభరంగి గ్రామంలో మండలం పరిషత్ ప్రాధమిక పాఠశాలలో గడిచిన రెండు సంవత్సరాల నుండి ప్రారంభమై ఇప్పటివరకు నాడు నేడు పాఠశాల పనులు పూర్తి కాలేదు. పిల్లలు కూర్చునేందుకు కూడా గచ్చు లేదు. దాని కారణంగా మంగళవారం ఉపాధ్యాయులు చొరవ తీసుకుని సొంతంగా గచ్చు వేసుకోవడం జరిగింది. ప్రభుత్వం స్పందించి వెంటనే పాఠశాల భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్