విశాఖలోని మూడవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని పెట్రోల్ బంక్ లో వినియోగదారుడిపై బంక్ సిబ్బంది దాడి చేశారు. సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. రేసవాని పాలెం స్పెన్సర్స్ పక్కన హెచ్పీ బంక్లో పెట్రోల్ కోసం వెళ్లిన వినియోగదారుడికి. బంక్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో బంక్ సిబ్బంది వినియోగదారుడిపై దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.