స్టీల్ ప్లాంట్ రక్షణకై సిపిఎం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం పార్టీ పోలెట్ బ్యూరో సభ్యులు బి. వి. రాఘవులు కోరారు. సిపిఎం ఆధ్వర్యంలో గురువారం కూర్మన్నపాలెం అమరవీరుల స్థూపం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కర్నీ అభినందించారు. సీఎం జగన్ ద్వంద్వ వైఖరి కారణంగానే ఉక్కుకు కష్టాలు ఏర్పడ్డాయన్నారు.