అగ్నిప్రమాదంలో రెండు పశువుల పాకలు దగ్ధం

2611చూసినవారు
గొలుగొండ మండలంలోని చీడిగుమ్మల పంచాయతీ యరకంపేట గ్రామంలోని సోమవారం రాత్రి రెండు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన పట్నాల సన్నిబాబు, గజ్జి రాజబాబుకు చెందిన రెండు పశువుల పాకలు దగ్ధం కావడంతో గ్రామస్థులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఎవరో గుర్తు తెలియని వారు దగ్ధం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. నష్టపరిహారం మంజూరు చేసి ఆదుకోవాలని బాధితులు కోరారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్