వైసిపి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం

1117చూసినవారు
వైసిపి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం
వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ మంత్రి చింతకాయలు అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. శనివారం సాయంత్రం మాకవరపాలెం మండలం బయ్యవరం గ్రామంలో ఎన్నికల శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల మయం చేశారన్నారు. ఎక్కడా ఎటువంటి అభివృద్ధి చేయలేదని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్