అల్లూరి జిల్లాలో గిరిజనులకు తప్పని డోలిమోత కష్టాలు

58చూసినవారు
అల్లూరి జిల్లాలో పలు గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక గిరిజనులకు డోలిమోత కష్టాలు తప్పడం లేదు. పాడేరు మండలంలోని ఇరాడపల్లి పంచాయతీ పరిధి దిగుసంపలు గ్రామానికి చెందిన నిండు గర్భిణి పాంగి. చిన్నతల్లికి శుక్రవారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో గ్రామానికి రహదారి సౌకర్యం లేక కుటుంబీకులు డోలికట్టి చిన్నతల్లికి అడవి గూండ ఇరాడపల్లి వరకు మోసుకొచ్చి అక్కడి నుంచి పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్