వారంలో ఇద్దరు శిశువులు మృతి

59చూసినవారు
వారంలో ఇద్దరు శిశువులు మృతి
జి.మాడుగుల మండలం మద్దిగరువు పంచాయతీ పరిధి పులుసుమామిడిలో వారం వ్యవధిలో ఇద్దరు శిశువులు మృతి చెందారు. ఈ నెల 22న 4 నెలల పాప మృతి చెందగా అదే గ్రామానికి చెందిన 3 నెలల బాబు ఆదివారం చనిపోయాడు. శిశు మరణాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అలాగే దీనికి గల కారణాలపై వైద్య బృందాలు అధ్యయనం చేయాలని ప్రజా సంఘాల ఐక్య వేదిక సహ కన్వీనర్ కె. వై. కుమార్ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్