పెందుర్తి: "నష్టపోయిన వారికి న్యాయం చేయాలి"

80చూసినవారు
పెందుర్తి జంక్షన్ నుంచి ఆనందపురం రోడ్డు విస్తరణలో నష్టపోయిన ప్రజలకు న్యాయం చేయాలని మాజీ కార్పొరేటర్ ఎస్ అప్పలనాయుడు డిమాండ్ చేశారు. సోమవారం నష్టపోయిన బాధితులతో కలిసి రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ తను కార్పొరేటర్ గా ఉన్నప్పుడు ఈ విధంగా నష్టపోయిన బాధితులకు టీడీఆర్ లు మంజూరు చేసి న్యాయం చేశామన్నారు. అదేవిధంగా బాధితులను ఆదుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్