గర్భిణీ స్త్రీని డోలి కట్టి మోసిన 108 సిబ్బంది

59చూసినవారు
అడ్డతీగల మండలం డి. పోలవరం మారుమూల గ్రామంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గిరిజన మహిళ ఆదివారం 108 కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఆ గ్రామానికి వెళ్లేందుకు రోడ్ సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో, మూడు కిలోమీటర్లు మేర నడుచుకుంటూ గర్భిణీ వద్దకు వెళ్లిన 108 సిబ్బంది. చేసేదేమి లేక జోరు వానలో నిండు గర్భిణీని అంబులెన్సు సిబ్బంది మోసుకొని అంబులెన్సు వద్దకు తీసుకొని వచ్చి అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్