మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వైసీపీలో చేరిన రాయుడు పది రోజుల వ్యవధిలోనే రాజీనామా చేశారు. ప్రస్తుతం జనసేనలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే
జనసేన నాయకులతో రాయుడు టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. సాయంత్రంలోగా జనసేనలో చేరికపై క్లారిటీ రానుంది. కాగా
జనసేన అధినేత పవన్తో రాయుడు భేటీ కొనసాగుతోంది.