ఏచూరి మరణం కార్మిక లోకానికి తీరని లోటు

51చూసినవారు
ఏచూరి మరణం కార్మిక లోకానికి తీరని లోటు
సీపీఎం అధినేత సీతారాం ఏచూరి మృతి కార్మికలోకానికి తీరని లోటని అనకాపల్లి జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ అన్నారు. పరవాడ సీఐటీయూ కార్యాలయంలో ఆయన మృతికి శనివారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్మికుల ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను ఆయన పరిష్కరించ గలిగారని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్