కోట్నాబిల్లిలో ప్రజాభిప్రాయ సేకరణపై నిరసన

73చూసినవారు
కోట్నాబిల్లిలో ప్రజాభిప్రాయ సేకరణపై నిరసన
రావికమతం మండలం కోట్నాబెల్లి గ్రామంలో బుధవారం గ్రానైట్ క్వారీ అనుమతులు కోసం ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టారు. నర్సీపట్నం ఆర్డిఓ వివి రమణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జేఈ కరుణ కుమారి, తహసిల్దార్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సమయంలో పాతకోట్నిబిల్లీ ఆదివాసి గిరిజన మహిళలు నిరసన తెలుపుతూ మాకుక్వారీలు వద్దు మంచినీరు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతూ అభిప్రాయ సేకరణ సభ ముందు ఆందోళన చేశారు.

సంబంధిత పోస్ట్