ఇసుక దోపిడీకి పాల్పడిన వారిపై చర్యలు

67చూసినవారు
గత ప్రభుత్వ హయాంలో గబ్బాడ ఇసుక రీచ్ లో దోపిడికి పాల్పడిన వారిని త్వరలో అరెస్టు చేయడం తథ్యమని జనసేన నర్సీపట్నం ఇన్ఛార్జ్ సూర్య చంద్ర అన్నారు. మంగళవారం నర్సీపట్నంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ కు చెందిన ప్రతిమ కంపెనీ గబ్బాడ రీచ్ లో కోట్లాది రూపాయల ఇసుక దోచుకుందని ఆరోపించారు. ఆ కంపెనీ యాజమానిని త్వరలో అరెస్టు చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్