అనకాపల్లి డిసిసి అధ్యక్షునిగా మీసాల

56చూసినవారు
అనకాపల్లి డిసిసి అధ్యక్షునిగా మీసాల
అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నర్సీపట్నంకు చెందిన మీసాల సుబ్బన్నను నియమిస్తూ అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సి వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సుబ్బన్న గతంలో డిసిసి అధ్యక్షునిగా పని చేసారు. మరల ఆయనకు అవకాశం కల్పించడం పట్ల పిసిసి మాజీ కార్యదర్శి పడాల కొండలరావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్