ఎంఈఓలతో సమావేశమైన స్పీకర్

55చూసినవారు
ఎంఈఓలతో సమావేశమైన స్పీకర్
నర్సీపట్నం నియోజకవర్గ స్థాయి స్కూల్ గేమ్ ఫెడరేషన్ టోర్నమెంట్ కం సెలక్షన్స్ సెప్టెంబర్ 25, 26 తేదీల్లో సర్సీపట్నంలో నిర్వహించనున్నారు. దీనిపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నాలుగు మండలాల ఎంఈఓలతో శనివారం తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. కమిటీలను వేసి నిర్వహణ బాధ్యతలు వారికి అప్పగించారు. గేమ్స్ సమయంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పటిష్టంగా చూడాలని అన్నారు.

సంబంధిత పోస్ట్