ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పాయకరావుపేటకు చెందిన జగతా శ్రీనివాస్ మరొకసారి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి సి వేణుగోపాల్ జారీ చేసిన ఆదేశాలను పిసిసి అధ్యక్షులు షర్మిల అందజేశారు. తనపై నమ్మకంతో మరోసారి బాధ్యతలు అప్పగించడం పట్ల రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మ కి, ఏఐసీసీకి జగతా శ్రీనివాస్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.