విశాఖ: సందర్శుకులతో రద్దీగా బీచ్ లు

75చూసినవారు
విశాఖ నగరంలోని బీచ్ లన్నీ ఆదివారం సాయంత్రం రద్దీగా కనిపించాయి. రోజంతా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజానీకం కుటుంబ సమేతంగా బీచ్ లలో సేద తీరారు. రోజంతా ఎండ కాసినప్పటికీ సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. నగరంలోని ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్ లు సందర్శకులతో రద్దీగా దర్శనమిచ్చాయి. ప్రశాంత వాతావరణంలో సముద్రపు అలలను చూస్తూ సేద తీరారు. సందర్శకులు దిగకుండా లైఫ్ గార్థులు, పొలీసులు బందోబస్తు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్