టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు టిడిపి ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేద్దామని గుంతకల్లు నియోజకవర్గం టిడిపి ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం బుధవారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేస్తానని అధినేత హామీ ఇచ్చారని కావున ఎంపి, ఎమ్మెల్యేలను గెలిపించుకుందామన్నారు.