మహిళపై దాడికి యత్నం!

85చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని పార్వతినగర్ చెందిన కళ్యాణి యానిమేటర్ గా పనిచేస్తోంది. అయితే జనసేన పార్టీ యానిమేటర్ గా తమకే హక్కు ఉందని జాకీర్ హుస్సేన్, అతని కుటుంబ సభ్యులు కళ్యాణి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి కొట్టే ప్రయత్నం చేశారని, బీజేపీ నాయకులు రావడంతో గొడవ సద్దుమనిగినట్లు స్థానికులు తెలిపారు. కాగా వీరి నుంచి తనకు రక్షణ కల్పించాలని బాధితురాలు కోరింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్