రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని.. ముగ్గురికి గాయాలు

564చూసినవారు
రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని.. ముగ్గురికి గాయాలు
ఉరవకొండ పట్టణ శివారులోని గుంతకల్లు ప్రధాన రహదారిపై రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ప్యాపిలి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, బళ్లారికి చెందిన ఓ వ్యక్తి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిని స్థానికులు ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రధమ చికిత్స అనంతరం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో మేరకు మెరుగైన వైద్యం కోసం 108 అత్యవసర వాహనంలో అనంతపురం తరలించారు.

సంబంధిత పోస్ట్