కౌలు రైతుల రక్షణ కోసం నూతన సమగ్ర చట్టాన్ని వెంటనే తీసుకురావాలని అనంతపురం జిల్లా కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రామంజి నేయులు ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కలెక్టరేట్ లో సోమవారం జరిగిన గ్రీవెన్స్లో కలెక్టర్ వినోద్ కుమార్ కు కౌలు రైతుల సమస్యల పై వినతిపత్రం ఇచ్చారు. అనేక మంది భూములు కౌలుకు తీసుకుని తీవ్రంగా నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.