ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనంతపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఏళ్ల తరబడి టీడీపీలో పని చేసిన నాయకులు ఒక్కొక్కరుగా వీడుతున్నారు. సోమవారం టీడీపీ మైనార్టీ విభాగం అనంతపురం నగర అధ్యక్షుడు అజీజ్ అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పారు.