విద్యుత్ శాఖ ఫైల్స్ దహనం!

52చూసినవారు
విద్యుత్ శాఖ ఫైల్స్ దహనం!
ధర్మవరం పట్టణంలో విద్యుత్ శాఖ సిబ్బంది పాత ఫైల్స్ ను దహనం చేశారు. ఈ సంఘటన కలకలం సృష్టించింది. పాత ఫైల్స్ దహనం చేస్తున్న సంగతి తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు మీడియాకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వెళ్లి పరిశీలించగా విద్యుత్ శాఖకు చెందిన ట్రక్కు నిండా పాత ఫైల్స్ తగలపెట్టడానికి తీసుకువచ్చారు. దీనిపై ఏఈ కొండారెడ్డి స్పందిస్తూ పదేళ్ల క్రితం పనికిరాని ఫైల్స్ ని దహనం చేస్తున్నట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్