మరోసారి ఆదరిస్తే ధర్మవరాన్ని మరింత అభివృద్ధి చేస్తా

60చూసినవారు
మరోసారి ఆదరిస్తే ధర్మవరాన్ని మరింత అభివృద్ధి చేస్తా
ధర్మవరం పట్టణంలోని 29, 30, 31, 32వ వార్డుల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నవరత్నాల ద్వారా మనందరికీ సంక్షేమ ఫలాలు అందించిన జగన్ను మరోసారి సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మీకు మంచి చేసింటే ఓటు వేయండి అని అడిగే సత్తా కేవలం జగన్కి మాత్రమే ఉందన్నారు. మరోసారి గెలిస్తే ధర్మవరాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపిస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్